ఓవైసీ జంక్షన్, షేక్‌పేట్ ఫ్లై ఓవర్లను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి

ABN , First Publish Date - 2021-12-23T20:24:47+05:30 IST

ఒవైసీ జంక్షన్, షేక్‌పేట్ ఫ్లై ఓవర్లను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు.

ఓవైసీ జంక్షన్, షేక్‌పేట్ ఫ్లై ఓవర్లను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్: ఓవైసీజంక్షన్, షేక్‌పేట్ ఫ్లై ఓవర్లను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. ఈసందర్భంగా ఏబీఎన్‌తో మేయర్ మాట్లాడుతూ.. ఈ నెల చివరి లోపు షేక్‌పేట్ ఫ్లై ఓవర్, ఓవైసీ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామన్నారు. 350కోట్లతో షేక్‌పేట్, 67కోట్లతో ఓవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్లు పూర్తి అయ్యాయన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు 8 వేల కోట్ల రూపాయలతో ఎస్సార్డీపీ కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఎస్సార్డీపీ కింద మొత్తం 22 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.ఈఫ్లై ఓవర్లతో చాలా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. మరో 25 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు పనులు జరుగుతున్నాయని చెప్పారు.ఈ పనులను వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామని  మేయర్ విజయలక్ష్మి తెలిపారు. 

Updated Date - 2021-12-23T20:24:47+05:30 IST