మైలవరంలో టీడీపీ నేతల ఆందోళన
ABN , First Publish Date - 2021-07-28T20:29:36+05:30 IST
మైలవరంలో టీడీపీ నేతల ఆందోళనకు దిగారు. టీడీపీ నేత దేవినేని ఉమను విడుదల చేయాలని కోరుతూ ఈ పార్టీ నేతలు నిరసన చేపట్టారు.
కృష్ణా: మైలవరంలో టీడీపీ నేతల ఆందోళనకు దిగారు. టీడీపీ నేత దేవినేని ఉమను విడుదల చేయాలని కోరుతూ ఈ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్టేషన్కు తరలించారు. దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా... వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరిగి పోలీసులు దేవినేనిపైనే 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం.