ఆదేశాలివ్వలేం: సుప్రీం కోర్టు

ABN , First Publish Date - 2021-11-19T13:31:46+05:30 IST

ఎలాంటి ఆదేశాలు..

ఆదేశాలివ్వలేం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: టర్మ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే విషయంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులకు ప్రస్తుత దశలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. 10, 12వ తరగతులకు ఫస్ట్‌ టర్మ్‌ పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో కూడా పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం... సీబీఎస్ఈ టర్మ్‌ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఐసీఎస్ఈ పరీక్షలు కూడా ఈనెల 22 నుంచి మొదలుకానున్నాయని పేర్కొంది. ఈ దశలో పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది.



Updated Date - 2021-11-19T13:31:46+05:30 IST