జీఎస్‌టీ రిటర్న్‌ల జాప్యంపై గరిష్ఠ లేటు ఫీజు రూ.500

ABN , First Publish Date - 2020-07-04T06:46:58+05:30 IST

జీఎస్‌టీఆర్‌-3బి నెలవారీ, త్రైమాసిక రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఒక్కో రిటర్న్‌పై గరిష్ఠ లేట్‌ పేమెంట్‌ ఫీజును రూ.500కి పరిమితం చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు

జీఎస్‌టీ రిటర్న్‌ల జాప్యంపై గరిష్ఠ లేటు ఫీజు రూ.500

న్యూఢిల్లీ: జీఎస్‌టీఆర్‌-3బి నెలవారీ, త్రైమాసిక రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఒక్కో రిటర్న్‌పై గరిష్ఠ లేట్‌ పేమెంట్‌ ఫీజును రూ.500కి పరిమితం చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలన్న షరతుపై 2017 జూలై నుంచి 2020 జూలై వరకు దాఖలయ్యే రిటర్న్‌లన్నింటికీ ఈ ఫీజు వర్తిస్తుందని సీబీఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను చెల్లింపు జీరో (నిల్‌ రిటర్న్‌)  ఉన్న కేసుల్లో ఈ లేట్‌ పేమెంట్‌ ఫీజు కూడా ఉండదని తెలియచేసింది.

Updated Date - 2020-07-04T06:46:58+05:30 IST