మనూలో వర్క్‌షాపు ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-12T06:56:42+05:30 IST

గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో పరిశోధన పండితుల కోసం ఐదురోజుల పాటు ఆన్‌లైన్‌ వర్క్‌షాపును

మనూలో వర్క్‌షాపు ప్రారంభం

రాయదుర్గం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో పరిశోధన పండితుల కోసం ఐదురోజుల పాటు ఆన్‌లైన్‌ వర్క్‌షాపును ఆదివారం ప్రారంభించారు. ది సెంటర్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఉర్దూ మీడియం టీచర్‌, ది ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ రిసెర్చ్‌ అండ్‌ కన్సల్‌టెన్సీ ఆఫ్‌ మనూ, తెలంగాణ స్ట్టేట్‌ ఉర్దూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్క్‌షాపును మనూ ఇన్‌చార్జి వైస్‌ చాన్సులర్‌ ప్రొఫెసర్‌ రెహ్మతుల్లా ప్రారంభించారు. రిసెర్చ్‌ మెథడాలజీ అండ్‌ ఐసీటీ టూల్స్‌ పేరుతో నిర్వహించిన ఈ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. సాంఘిక అభివృద్ధికి పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. టీఎస్‌యూఏ డైరెక్టర్‌, సెక్రెటరీ డాక్టర్‌ ఎండీ గౌస్‌ మాట్లాడుతూ పరిశోధకులు సమాజాభివృద్ధికి ముందస్తు ప్రణాళికలపై అధ్యాయనం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ జహంగీర్‌ హుస్సెన్‌, రిసెర్చ్‌ అండ్‌ కన్సల్‌టెన్సీ డీన్‌ ప్రొఫెసర్‌ సల్మా హమీద్‌ ఫారూకి, ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T06:56:42+05:30 IST