సమస్యను డబ్ల్యూహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లాం: జమ్మూకశ్మీర్‌ను వేరే రంగులో చూపడంపై భారత్

ABN , First Publish Date - 2022-02-01T01:09:36+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్ముకశ్మీర్, లడక్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకంటే

సమస్యను డబ్ల్యూహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లాం: జమ్మూకశ్మీర్‌ను వేరే రంగులో చూపడంపై భారత్

న్యూఢిల్లీ:  ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్మూకశ్మీర్, లడక్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకంటే భిన్నమైన రంగులో చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే,  1963లో చైనాకు పాకిస్థాన్ చట్ట విరుద్ధంగా ఇచ్చిన 5168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని షేక్స్‌గమ్ వ్యాలీని చైనాలో భాగంగా చూపించారు. 1954లో చైనా ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని లేత నీలం రంగు గళ్లలో చూపించారు. చైనా భూభాగాన్ని చూపించడానికి ఉపయోగించిన రంగు కూడా ఇదే. 


దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఈ విషయాన్ని బలంగా లేవనెత్తినట్టు చెప్పారు. 

Updated Date - 2022-02-01T01:09:36+05:30 IST