ప్రధాని మోదీకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మాతా అమృతానందమయి
ABN , First Publish Date - 2020-08-03T17:43:17+05:30 IST
రక్షా బంధన్ ను పురస్కరించుకొని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాతా అమృతానందమయి
న్యూఢిల్లీ : రక్షా బంధన్ ను పురస్కరించుకొని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాతా అమృతానందమయి ప్రధాని మోదీకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశం వెలుపలా, సరిహద్దు దేశాలతో చాలా సంక్షోభాలే ఉన్నాయి. దేశాన్ని కాపాడటానికి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చాలా సమర్థవంతమైన, సరియైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలను కాపాడే శక్తిని మీకు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’’ అంటూ వీడియో సందేశంలో మాతా అమృతానంద మయి పేర్కొన్నారు.
దీనిపై ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అమ్మ. గొప్ప దేశం కోసం పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు మీ ఆశీర్వాదలు కోరుతున్నా. దేశం అభివృద్ధి, పురోగతికి శక్తి అవసరమని, దేశంలోని నారీ శక్తి నాకు గొప్ప బలాన్ని ప్రసాదించాలి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.