అహ్మద్ పటేల్ మృతి పార్టీకి తీరని లోటు: మస్తాన్ వలి
ABN , First Publish Date - 2020-11-25T17:37:47+05:30 IST
గుంటూరు: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.
గుంటూరు: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అహ్మద్ పటేల్ చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ.. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి యాభై సంవత్సరాల పాటు సేవలందించారన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీకి అండగా ఉన్నారన్నారు. అహ్మద్ పటేల్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయ కార్యదర్శిగా ఉంటూ అనేక సేవలు అందించిన అహ్మద్ పటేల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని మస్తాన్ వలి పేర్కొన్నారు.