రెవెన్యూలో భారీగా బదిలీలు
ABN , First Publish Date - 2022-05-23T05:30:00+05:30 IST
రెవెన్యూలో భారీగా బదిలీలు
- 8 మంది తహసీల్దార్లు, 6మంది నాయబ్ తహసీల్దార్లు, ముగ్గురు ఆర్ఐలు
వికారాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్ జిల్లాలో ఎనిమిది మంది తహసీల్దార్లు, ఆరుగురు నాయబ్ తహసీల్దార్లు, ముగ్గురు ఆర్ఐలు బదిలీ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏలో సూపరింటెండెంట్గా పనిచేసి వికారాబాద్ జిల్లాకు కేటాయించిన సి.భువనేశ్వర్ను ధారూరు తహసీల్దార్గా నియమించగా, అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ టి.భీమయ్యగౌడ్ను వికారాబాద్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా పనిచేస్తున్న జి.అమరేందర్కృష్ణను కలెక్టరేట్ ఏవోగా బదిలీ చేశారు. కలెక్టరేట్ ఏవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.హరిత దేవిని ఆ బాధ్యతలనుంచి తప్పించారు. కలెక్టరేట్లో డి-సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సుధను తాండూరు ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా. సచివాలయంలో పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తూ జిల్లాకు వచ్చిన పి.రాంబాబును పరిగి తహసీల్దార్గా నియమించారు. పరిగి తహసీల్దార్గా పనిచేస్తున్న ఎన్.విద్యాసాగర్రెడ్డిని కలెక్టరేట్కు బదిలీ చేశారు. పూడూరు తహసీల్దార్గా పనిచేస్తున్న జి.కిరణ్కుమార్ను మోమిన్పేట్ తహసీల్దార్గా బదిలీ చేసి పూడూరు తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్లో హెచ్-సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఎం.శ్రీధర్ను మర్పల్లి తహసీల్దార్గా బదిలీ చేశారు. ఇదిలా ఉంటే, మోమిన్పేట నాయబ్ తహసీల్దార్గా పనిచేస్తున్న రవీందర్దత్ను కలెక్టరేట్లో ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.విజయ్ ధారూరు నాయబ్ తహసీల్దార్గా బదిలీ అయ్యారు. ధారూరులో నాయబ్ తహసీల్దార్గా పనిచేసిన టి.వెంకటయ్యను సివిల్ సపయీస్ డిప్యూటీ తహసీల్దార్గా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న శ్రీనివా్సను తాండూరు ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్గా నియమించారు. పూడూరు మండల నాయబ్ తహసీల్దార్గా పనిచేస్తున్న యు.ఉమే్షను మర్పల్లికి బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న మోహన్ను పూడూరు నాయబ్ తహసీల్దార్గా నియమించారు. సివిల్ సప్లయీ్సలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీలతను వికారాబాద్ నాయబ్ తహసీల్దార్గా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న జి.విజయేందర్ను సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్గా నియమించారు. కాగా, కులకచర్ల ఎంఆర్ఐగా పనిచేస్తున్న వీరే్షకుమార్ను ధారూరు మండలానికి బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న చంద్రమోహన్ను పరిగి మండల ఎంఆర్ఐగా నియమించారు. తాండూరు డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బాలయ్యను కులకచర్ల ఎంఆర్ఐగా బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.