హనుమకొండలో భారీ చోరీ
ABN , First Publish Date - 2021-11-15T22:24:36+05:30 IST
పట్టణంలో నడిరోడ్డుపై భారీ చోరీ జరిగింది. నక్కలగుట్ట
హనుమకొండ: పట్టణంలో నడిరోడ్డుపై భారీ చోరీ జరిగింది. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద కారు అద్దాలు పగులగొట్టి 25 లక్షలను దొంగలు కొట్టేశారు. బాధితులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో డబ్బు డ్రా చేసి, కారులో పెట్టి సంతకం కోసం బ్యాంకులోకి వెళ్లి తిరిగి వచ్చారు. అనంతరం బయటికి వచ్చి చూసే సరికి కారు అద్దాలు పగులగొట్టి డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.