అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-07-12T13:08:03+05:30 IST

అనంతపురం : జిల్లాలోని బత్తలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం : జిల్లాలోని బత్తలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఇద్దరి మృతదేహాలు చిన్నాభిన్నం అయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన వారు తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన భార్య భర్తలు సూర్య, ఆదెమ్మగా గుర్తించారు.


ప్రమాదం జరిగిన వెంటనే 108కు స్థానికులు ఫోన్ చేశారు. గంటపాటు ఎదురుచూసినా ఘటనాస్థలికి అంబులెన్స్ చేరుకోకపోవడం గమనార్హం. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌కు ఫోన్ చేసిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. తెల్లవారుజామున తాడిమర్రి మండలం పిన్నదరి నుంచి ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ రోజూ బత్తలపల్లికి వచ్చి బొప్పాయి కాయలు అమ్ముకొని జీవనం సాగించేవారు.

Updated Date - 2020-07-12T13:08:03+05:30 IST