ఏపీ సచివాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-05-09T16:12:12+05:30 IST

ధరల పెరుగుదలను నిరసిస్తూ చలో సచివాలయానికి సీపీఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఏపీ సచివాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

అమరావతి: ధరల పెరుగుదలను నిరసిస్తూ చలో సచివాలయానికి సీపీఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చలో సచివాలయానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే సచివాలయం ముట్టడించి తీరతామంటున్న సీపీఐ నేతలు చెబుతున్నారు. 


దాసరి భవన్ వద్ద హైటెన్షన్...

మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్  వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చల్లో సచివాలయానికి వెళ్లేందుకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో సీపీఐ కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలు ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు దాసరి భవన్ వద్దకు భారీగా  మోహరించారు.  200 మంది సీపీఐ కార్యకర్తలు కార్యాలయం లోపలే ఉన్నారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కార్యాలయంలో లోపలకు పోలీసులను వెళ్ళనియకుండా గుమ్మంలో సీపీఐ, అనుబంధ కార్యకర్తలు అడ్డుగా కూర్చున్నారు. 

Read more