కడపలో వైసీపీ నేతల భారీ భూకబ్జా

ABN , First Publish Date - 2022-04-28T17:12:51+05:30 IST

నగర శివార్లలో వైసీపీ నేతల భారీ భూకబ్జా వెలుగులోకి వచ్చింది.

కడపలో వైసీపీ నేతల భారీ భూకబ్జా

కడప: నగర శివార్లలో వైసీపీ నేతల భారీ భూకబ్జా వెలుగులోకి వచ్చింది. ఎన్జీఓ హౌసింగ్ సోసిటీకి చెందిన 41 ఎకరాల భూమిలోని ప్లాట్లను అక్రమార్కులు చదును చేసి కబ్జాకు పాల్పడ్డారు. దీంతో ఆక్రమణల చెర నుంచి తమ ప్లాట్లను రక్షించాలంటూ ఎన్జీవోల వినతి చేశారు. 50 కోట్లు విలువ చేసే భూమిని అక్రమార్కులు దున్నేసారని ఎన్జీఓలు ఆరోపిస్తున్నారు. ఎన్జీఓల స్థలంలో ఆక్రమణలు చేసి తిరిగి ముత్యాల రాణి పేరుతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఎన్జీవోల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-28T17:12:51+05:30 IST