ఆల్మట్టికి భారీగా ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2020-07-11T10:37:42+05:30 IST

కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శుక్రవారం ప్రాజెక్టుకు 72,031 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు

ఆల్మట్టికి భారీగా ఇన్‌ఫ్లో

సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలంకు వరద


గద్వాల/నాగర్‌కర్నూల్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శుక్రవారం ప్రాజెక్టుకు 72,031 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు 63.37 టీఎంసీల నీరు వరద రూపంలో చేరగా, ప్రస్తుతం 87.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జల విద్యుత్తు కోసం 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాయరాణపూర్‌ ప్రాజెక్టుకు 16,591 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, ప్రాజెక్టు 37.37 టీఎంసీలకు గాను 27.73 టీఎంసీల నీరు నిల్వగా ఉన్నది.


జూరాల ప్రాజెక్టుకు స్థానికంగా కురుస్తున్న వర్షాల ద్వారా మూడు వేల క్యూసెక్కుల వరద చేరింది. ప్రస్తుతం నెట్టుంపాడు, భీమా పథకాలకు 1,489 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, ప్రాజెక్టు 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తోంది. సుంకేసుల నుంచి 8,824 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 5,640 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ప్రాజెక్టులో 813.6 అడుగుల స్థాయి నుంచి నీటి మట్టం 814.10 అడుగులకు చేరింది.

Updated Date - 2020-07-11T10:37:42+05:30 IST