ఈ కామర్స్ కంపెనీల పేరుతో భారీ మోసం

ABN , First Publish Date - 2021-08-01T00:18:35+05:30 IST

కొరియర్ లాజిస్టిక్స్, ఈ కామర్స్ కంపెనీల ఫ్రాంఛైజెస్ పేరుతో భారీ మోసం

ఈ కామర్స్ కంపెనీల పేరుతో భారీ మోసం

హైదరాబాద్: కొరియర్ లాజిస్టిక్స్, ఈ కామర్స్ కంపెనీల ఫ్రాంఛైజెస్ పేరుతో భారీ మోసం జరిగినట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ తెలిపింది. సిప్రొ కంపెనీ పేరుతో బిజినెస్ మొదలు పెట్టారని పేర్కొంది. సిప్రొ కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాలలో 12 ఫ్రాంఛైజెస్ ఉన్నాయని తెలిపింది. సిప్రొ కంపెనీకి ఫ్రాంఛైజెస్ యూనిట్ మెంబెర్స్ రూ.10 లక్షలు నగదు చెల్లించారని మిషనరేట్  పేర్కొంది. ఫ్రాంఛైజెస్ కోసం చెల్లించిన నగదుతో సిప్రొ ఎండీలు నరేంద్ర భేటి, సంతోష్ పర్వాల్ జల్సాలు చేసుకున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-08-01T00:18:35+05:30 IST