మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌..

ABN , First Publish Date - 2020-10-19T03:51:25+05:30 IST

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌..

ముంబై : మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆదివారం నాడు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు-మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారంతో సీ60 కమాండో ఫొర్సెస్ కూబింగ్ చేశాయి. 


ఈ క్రమంలో కొసమి-కిసనెల్లి అడవి మధ్యలో మావోలు తారసపడ్డారు. దీంతో పోలీసులు-మావోల మధ్య ఎదరు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోలు మృతి చెందగా.. మరికొందరు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారికోసం పోలీసులు ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇంకా పదిహేను మందిపైగానే మావోలు తప్పించుకున్నారని సమాచారం. కాగా ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-19T03:51:25+05:30 IST