Panjagutta: మసాజ్‌ సెంటర్లపై పోలీసుల దాడులు.. పలువురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-14T15:59:12+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు మసాజ్‌ సెంటర్లు, స్పాలపై పంజాగుట్ట పోలీసులు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్లను అరెస్ట్‌

Panjagutta: మసాజ్‌ సెంటర్లపై పోలీసుల దాడులు.. పలువురి అరెస్ట్‌

హైదరాబాద్/పంజాగుట్ట: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు మసాజ్‌ సెంటర్లు, స్పాలపై పంజాగుట్ట పోలీసులు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్లను అరెస్ట్‌ చేశారు. పలువురు యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాపురి కాలనీలోని నీలం హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకుడు మహేష్‌, ముగ్గురు కష్టమర్స్‌, ముగ్గురు సిబ్బందిని, లాల్‌ బంగ్లాలోని నేచురల్‌ వెల్‌నెస్‌ స్పా, ఏపీటీ ఆయుర్వేదిక్‌ స్పాలపై దాడి చేసి నిర్వహకురాలు జి.ప్రీతి, ముగ్గురు వర్కర్స్‌, ఇద్దరు కష్టమర్స్‌, నిర్వాహకుడు భాను ప్రకాష్‌, రిసెప్షని్‌స్టలను అరెస్ట్‌ చేశారు. యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-14T15:59:12+05:30 IST