మళ్లీ మాస్క్‌.. రాజధానిలో తప్పనిసరి

ABN , First Publish Date - 2022-06-29T16:56:46+05:30 IST

మూణ్ణెళ్లుగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మళ్లీ

మళ్లీ మాస్క్‌.. రాజధానిలో తప్పనిసరి

                           - Covid కేసులు పెరుగుతుండడమే కారణం 


బెంగళూరు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మూణ్ణెళ్లుగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మళ్లీ మాస్క్‌ ధరించక తప్పేట్టు లేదు. రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడంతో మళ్లీ తప్పనిసరి మాస్కు ఆంక్షలను ప్రవేశపెట్టాలని బీబీఎంపీ ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్‌తో చర్చించిన అనంతరం త్వరలోనే తుదినిర్ణయం తీసుకుంటామని బీబీఎంపీ స్పెషల్‌ కమిషనర్‌ త్రిలోక్‌చంద్ర ప్రకటించారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజధానిలో ప్రతిరోజూ 17వేలమందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, సగటున 600-700 పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. బాధితులు, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నారన్నారు. కొవిడ్‌ నాల్గో వేవ్‌ విషయంలో నిర్లక్ష్యం కూడదని హెచ్చరించిన ఆయన, అర్హులంతా బూస్టరక్షడోసు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈమేరకు జాగృతిని అధికం చేశామన్నారు.

Updated Date - 2022-06-29T16:56:46+05:30 IST