సెమీస్లో మేరీ, సిమ్రన్జిత్
ABN , First Publish Date - 2021-03-04T09:36:26+05:30 IST
బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60), జాస్మిన్ (57) సెమీ్సలోకి ప్రవేశించారు...
కాస్టెల్లాన్ (స్పెయిన్): బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60), జాస్మిన్ (57) సెమీ్సలోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్స్లో జియోర్డానా సోరెంటినో (ఇటలీ)పై మేరీకోమ్ గెలుపొందింది. యుజినియా ఆల్బన్స్ (స్పెయిన్)పై సిమ్రన్జిత్, సెల్మా మెడినా (ఆర్మేనియా)పై జాస్మిన్ విజయం సాధించారు. మనీషా మౌన్ (57 కేజీలు) మాత్రం ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల 63 కేజీల తొలి రౌండ్లో రాడ్డౌనే (ఇటలీ)పై మనీష్ కౌశిక్ నెగ్గి క్వార్టర్స్కు చేరాడు.