మారుతి కార్లు మరింత ప్రియం

ABN , First Publish Date - 2021-04-17T06:39:52+05:30 IST

దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మళ్లీ ధరలు పెంచేసింది. ఎంపిక చేసిన మోడల్‌ కార్ల ధరను శుక్రవారం నుంచి రూ.22,500 వరకు పెంచినట్లు తెలిపింది

మారుతి కార్లు మరింత ప్రియం

ఎంపిక చేసిన మోడళ్లపై రూ.22,500 వరకు పెంపు 


న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మళ్లీ ధరలు పెంచేసింది. ఎంపిక చేసిన మోడల్‌ కార్ల ధరను శుక్రవారం నుంచి రూ.22,500 వరకు పెంచినట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కొంత భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. ఈ విడతలో సెలెరియో, స్విఫ్ట్‌ మినహా మిగతా మోడల్‌ కార్ల ధరలు పెరిగాయి. ఢిల్లీ షోరూమ్‌ల్లో వీటి ధరల పెరుగుదల సగటు 1.6 శాతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మారు తి సుజుకీ ఆల్టో నుంచి ఎస్‌-క్రాస్‌ వరకు పలు మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఢిల్లీ షోరూమ్‌ల్లో వీటి ధర రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షల స్థాయిలో ఉంది. ఈ జనవరి 18న కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడళ్ల ధరను రూ.34,000 వరకు పెంచింది. 

Updated Date - 2021-04-17T06:39:52+05:30 IST