మూగజీవాల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న మార్స్ పెట్‌కేర్

ABN , First Publish Date - 2021-07-27T21:40:25+05:30 IST

మార్స్ పెట్‌కేర్ ఇండియా.. తమ తొలి హెల్త్ క్యాంప్‌‌ను హైటెక్ సిటీలోని ‘వీ’ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ప్రారంభించింది.

మూగజీవాల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న మార్స్ పెట్‌కేర్

హైదరాబాద్: మార్స్ పెట్‌కేర్ ఇండియా.. తమ తొలి హెల్త్ క్యాంప్‌‌ను హైటెక్ సిటీలోని ‘వీ’ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ప్రారంభించింది. మూగజీవాల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి.. పలు చోట్ల శిబిరాలను నిర్వహించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌లో రెండు మొబైల్ డాగ్ క్లినిక్స్, ఒక వెటర్నరీ డాక్టర్, ఒక సహాయకుడు ఉండనున్నారు. అలాగే జంతు సంరక్షణపై చట్టాలు, వాటి అమలు తదితర అంశాలపై ఈ క్యాంప్‌లలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంపై మార్స్ పెట్‌కేర్ సంస్థ జనరల్ మేనేజర్ గణేశ్ రమణి మాట్లాడుతూ.. మూగజీవాల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.   


Updated Date - 2021-07-27T21:40:25+05:30 IST