కట్నం కోసం వేధింపులు.. వివాహేతర సంబంధం అంటగట్టి..!
ABN , First Publish Date - 2022-02-18T14:06:58+05:30 IST
ఆమెకు వివాహేతర సంబంధం కూడా అంటగట్టి
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : అత్తింటివారు పెట్టే అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాంనగర్కు చెందిన పూర్ణిమకు 2014లో పంజాగుట్ట ప్రేమ్నగర్కు చెందిన బాలకృష్ణాచారితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. వివాహం అయినప్పటినుంచి భర్త, అత్తింటి వారు అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా పూర్ణిమను వేధించడం ప్రారంభించారు. ఆమెకు వివాహేతర సంబంధం కూడా అంటగట్టి వేధింపులు తీవ్రతరం చేశారు. వారి వేధింపులపై ఆమె, ఆమె తండ్రి రాజు చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బుధవారం రాత్రి గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త బాలకృష్ణాచారి, అతని తల్లిదండ్రులు, అన్నావదినలు, ఆడపడుచులు, మరిది, తదితరుల వేధింపులు భరించలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి రాజు చారి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.