HYD : మంగళసూత్రం తీసేసి పబ్కు వెళ్లిన మహిళకు ఊహించని షాక్..!
ABN , First Publish Date - 2021-11-13T16:39:18+05:30 IST
సరదా కోసం పబ్కు వెళ్తే ఓ మహిళ
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : సరదా కోసం పబ్కు వెళ్తే ఓ మహిళ మంగళసూత్రం మాయమైంది. బోయిన్పల్లికి చెందిన జిఆర్ రామచందర్ తన భార్య మీనాక్షితో కలిసి ఈ నెల 6న జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు-36 లోని కెమిస్ట్రీ పబ్కు వచ్చాడు. మీనాక్షి తన మంగళసూత్రం, రూ. వెయ్యి నగదును ఓ పర్సులో పెట్టి కారులో ఉంచింది. కారును పబ్ వద్ద నవీన్ అనే యువకుడికి వాలెట్ పార్కింగ్ నిమిత్తం ఇచ్చారు. రాత్రి తిరిగి కారు తీసుకొని ఇంటికి వెళ్తుండగా, పర్సు తెరిచి ఉన్నట్టు గమనించారు. అందులో చూడగా మంగళసూత్రం, నగదు కనిపించలేదు. బాధితులు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.