జీడిమెట్లలో గృహిణి అదృశ్యం
ABN , First Publish Date - 2021-05-09T17:35:57+05:30 IST
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది.
హైదరాబాద్/జీడిమెట్ల : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. రొడామిస్త్రీనగర్ ప్రాంతంలోని సుభాష్ చంద్రబోస్ నగర్లో నివాసముండే డప్పుడ దేవదాస్, లలిత(25) భార్యాభర్తలు. ఈ నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన లలిత కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.