అబద్ధం చెప్పి యువకుడితో స్నేహం చేసింది.. అతడిని ప్రేమలోకి దింపింది.. మొదటికే మోసం రావడంతో భర్తకు అసలు విషయం చెప్పి..

ABN , First Publish Date - 2021-12-10T17:58:17+05:30 IST

ఆమె వివాహిత.. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.

అబద్ధం చెప్పి యువకుడితో స్నేహం చేసింది.. అతడిని ప్రేమలోకి దింపింది.. మొదటికే మోసం రావడంతో భర్తకు అసలు విషయం చెప్పి..

ఆమె వివాహిత.. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు.. వివాహం కాలేదని అబద్ధం చెప్పి తన కంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో ఆమె స్నేహం చేసింది.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. ప్రేమ మైకంలో ఆమె అన్ని హద్దులూ దాటేసింది.. ఆ యువకుడు `పెళ్లి చేసుకుందాం` అని ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు.. దీంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.. చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


జబల్పూర్‌కు చెందిన 26 ఏళ్ల వివాహిత తన కంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన అమిత్ దాగర్‌తో సోషల్ మీడియా ద్వారా స్నేహం చేసింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ క్రమంలో ఇద్దరూ మరింత క్లోజ్ అయ్యారు. నగ్నంగా వీడియో కాల్స్ చేసుకునే వారు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిన అమిత్ పెళ్లి గురించి ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. ఆ ఒత్తిడి తీవ్రం కావడంతో ఆమె నిజం చెప్పేసింది. తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందని చెప్పింది. అయినా అమిత్ వెనక్కి తగ్గలేదు. భర్తకు విడాకులు ఇచ్చి తనతో వచ్చెయ్యాలని వేధించేవాడు. 


తనతో రాకపోతే న్యూడ్ వీడియో కాల్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. భయపడిన మహిళ తన భర్తకు విషయం చెప్పింది. ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త తర్వాత పరిస్థితి అర్థం చేసుకుని అమిత్‌కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా అమిత్ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో సదరు మహిళ గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-12-10T17:58:17+05:30 IST