కేటుగాడి చేతిలో మోసపోయిన వివాహిత

ABN , First Publish Date - 2021-08-20T01:50:38+05:30 IST

కలిసి ఉందామంటూ వివాహితను పాపన్న అనే వ్యక్తి ఘరానా మోసం చేశాడు. నిర్మల్

కేటుగాడి చేతిలో మోసపోయిన వివాహిత

కామారెడ్డి: కలిసి ఉందామంటూ వివాహితను పాపన్న అనే వ్యక్తి ఘరానా మోసం చేశాడు. నిర్మల్ జిల్లా బాసర (మ) ఎంచకు చెందిన లక్ష్మీ అనే వివాహితను మాయమాటలు చెప్పి పాపన్న మోసం చేసాడు. లక్ష్మీ వద్ద ఉన్న 8 వేల నగదు, సెల్‌ఫోన్లను తీసుకొని కామారెడ్డి బస్టాండ్‌లో పాపన్న వదిలి వెళ్లిపోయాడు. ఇద్దరం కలిసి ఉందాం అంటూ లక్ష్మిని  పాపన్న కామారెడ్డికి తీసుకువచ్చాడు. లక్ష్మికి మూడేళ్ల వయస్సున్న బాబు ఉన్నాడు. బతుకుదెరువు కోసం లక్ష్మి భర్త సాయిలు రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. పాపన్న చేతిలో మోసపోయానని కామారెడ్డి పోలీసులను బాధితురాలు లక్ష్మి ఆశ్రయించింది.  

Updated Date - 2021-08-20T01:50:38+05:30 IST