భర్త ఆఫీసుకు వెళ్లాడనుకుని ప్రేయసిని కలిసేందుకు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడా ప్రియుడు.. చివరకు కథ అడ్డం తిరిగిందిలా..!

ABN , First Publish Date - 2021-09-09T18:06:06+05:30 IST

భర్త ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత ఆమె తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది.. అతడితో సరసాలు ప్రారంభించింది..

భర్త ఆఫీసుకు వెళ్లాడనుకుని ప్రేయసిని కలిసేందుకు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడా ప్రియుడు.. చివరకు కథ అడ్డం తిరిగిందిలా..!

భర్త ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత ఆమె తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది.. అతడితో సరసాలు ప్రారంభించింది.. పక్కింటి వారి ద్వారా ఆ సమాచారం భర్తకు చేరింది.. దీంతో తన స్నేహితులతో పాటు ఇంటికి వచ్చిన భర్తకు వారిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. దీంతో భర్త, అతడి స్నేహితులు వారిద్దరినీ చెప్పులతో కొట్టారు.. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.  


ఝాన్సీలోని లలిత్‌పూర్‌లో నివసిస్తున్న ఓ వివాహిత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేనపుడు ప్రియుడిని ఇంటికే పిలిపించుకునేది. బుధవారం ఉదయం భర్త ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత ఎప్పటిలాగానే ప్రియుడికి ఫోన్ చేసింది. అతడు వెంటనే వచ్చేశాడు. ఇంతలో, ఎవరో ఆ మహిళ భర్తకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో అతను తన స్నేహితులతో ఇంటికి చేరుకున్నాడు. భార్య, ఆమె ప్రియుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.


ఇవి కూడా చదవండి


హోటల్ రూమ్‌లో ప్రేయసితో ఎంజాయ్ చేస్తూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..





పెళ్లి తర్వాత 25 మందితో ఆమె వెళ్లిపోయింది.. ఆమె తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమె భర్త ఏం అనేవాడంటే..


దీంతో ఆ వ్యక్తి, అతని స్నేహితులు ఆమెను, ఆమె ప్రియుడిని చెప్పులతో తీవ్రంగా కొట్టారు. తన ప్రియుడిని కాపాడేందుకు ఆమె ప్రయత్నించింది. పట్టుబడ్డ యువకుడు ఏమాత్రం ప్రతిఘటించకుండా దెబ్బలు తింటూ ఉండిపోయాడు. అతడిని కొట్టిన అనంతరం పోలీసులకు అప్పగించారు. అలాగే భార్యకు విడాకులు ఇచ్చేందుకు సదరు వ్యక్తి సిద్ధమవుతున్నాడు. 

Updated Date - 2021-09-09T18:06:06+05:30 IST