ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-07T06:48:02+05:30 IST
మానసకి స్థితి బాగోకపోవడంతో ఉదయశ్రీ (46) అనే వివాహిత ఎంవీపీకాలనీ ఆదర్శనగర్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.
ఎంవీపీ కాలనీ, మార్చి 6: మానసకి స్థితి బాగోకపోవడంతో ఉదయశ్రీ (46) అనే వివాహిత ఎంవీపీకాలనీ ఆదర్శనగర్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎంవీపీ జోన్ ఎస్ఐ లక్ష్మి కథనం ప్రకారం ఉదయశ్రీ భర్త శ్రీనివాసరావు పనిమీద బయటకు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఇంటికి వచ్చేసరికి ఉదయశ్రీ ఇంట్లో ఉరి వేసుకుని కనిపించిందన్నారు. దీంతో ఆయన డయల్ 100కు, చుట్టుపక్కల వారికి సమాచారం అందిచారన్నారు. వారు వచ్చి చూసేసరికే ఉదయశ్రీ మృతి చెంది ఉందన్నారు. కరోనా సమయం నుంచి ఉదయశ్రీ మానసికంగా బాధపడుతుందని, దీంతో ఆమెకు భర్త చికిత్స చేయిస్తున్నాడన్నారు. వీరికి ఇద్దరు పిల్లలుండగా, వారు చదువు నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారని పేర్కొన్నారు. భర్త ఫిర్యాదు మేరకు 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మి తెలిపారు.