వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-03T06:53:54+05:30 IST
అదనపు కట్నం కోసం అత్తగారింట వేధింపులు భరించలేని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బైరెడ్డిపల్లె మండలం కొత్తయిండ్లులో జరిగింది.
బైరెడ్డిపల్లె, మార్చి 2 : అదనపు కట్నం కోసం అత్తగారింట వేధింపులు భరించలేని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బైరెడ్డిపల్లె మండలం కొత్తయిండ్లులో జరిగింది. ఎస్ఐ మునిస్వామి కథనం మేరకు... కొత్తయిండ్లు గ్రామానికి చెందిన దుర్గ(21)కు అదే గ్రామానికి చెందిన శివప్పతో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా అదనపుకట్నం కోసం దుర్గకు అత్తగారింట్లో వేధింపులు అధికమయ్యాయి. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన దుర్గ సోమవారం రాత్రి ఇంటినుంచి వెళ్లిపోయింది. మంగళవారం గ్రామసమీపంలోని బావిలో ఆమె శవమై కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ సీతారామ్, ఎస్ఐ మునిస్వామి సంఘటనాస్థలానికి చేరుకుని విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.