వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-22T08:21:59+05:30 IST
నగరిలో శుక్రవారం మీనా(29) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
పుత్తూరు, నవంబరు 21: నగరిలో శుక్రవారం మీనా(29) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.... రేణిగుంట మండలం వీఆర్కండ్రిగకు చెందిన మీనాతో నగరి మండలం నత్తంకండ్రిగకు చెందిన సతీష్తో ఆరేళ్ల క్రితం వివాహ మైంది. వీరిద్దరికి ఓ కుమారుడున్నాడు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. శుక్రవారంకూడా ఇద్దరూ గొడవ పడ్డారు. సతీష్ కుమారుడిని తీసుకుని బజారుకెళ్లాడు. ఈ సమ యంలో మీనా ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన పక్కంటి మహిళ సతీష్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. అతడొచ్చి తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులుచెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తహసీల్దార్ బాబు శవపంచనామా నిర్వహించారు. సీఐ మద్దయ్య ఆచారి కేసు దర్యాప్తు చేస్తున్నారు.