వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-31T12:21:34+05:30 IST

పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ బండమీదపల్లెకు చెందిన పద్మజ(21) సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుని

వివాహిత ఆత్మహత్య

పీలేరు టౌన్‌, మార్చి 30: పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ బండమీదపల్లెకు చెందిన పద్మజ(21) సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల క్రితం కడప జిల్లా సుండుపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె పద్మజకు వేపులబైలు బండమీదపల్లెకు చెందిన రైల్వే గేట్‌మెన్‌ శివకృష్ణతో వివాహమైంది.


ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోని మొదటి ఫ్లోర్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిని గుర్తించిన భర్త ఆమెను హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-03-31T12:21:34+05:30 IST