వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-17T05:42:49+05:30 IST
మండలంలోని చింతలచెరువు గ్రామానికి చెందిన వివాహిత సునంద (30) శుక్రవారం ఉరివేసుకుంది.
పెద్దవడుగూరు, ఏప్రిల్ 16: మండలంలోని చింతలచెరువు గ్రామానికి చెందిన వివాహిత సునంద (30) శుక్రవారం ఉరివేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాలివి. సునంద కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య స మస్యలతో బాధపడుతూ ఉండేది. ఈక్రమంలో జీవితం పై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుంది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అవుకులో ఉపాధ్యాయుడు..
అవుకు, ఏప్రిల్ 16: ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిట్టమీది మురళీకృష్ణ (43) అవుకు రిజర్వాయర్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘట న శుక్రవారం వెలుగుచూసింది. ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపిన వివరాలివి. మృతుడు మురళీకృష్ణ స్వగ్రామం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక. తాడిపత్రిలో కుటుంబ సభ్యులతో నివాసముంటూ సమీపంలోని ఎస్ కొట్టాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. జీవితంపై విరక్తి చెంది ఈనెల 14న రాత్రికి అవుకు రిజర్వాయర్ వద్దకు చేరుకొని రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం మృతదేహం రిజర్వాయర్లో తేలటంతో పోలీసులు జాలర్ల సహాయంతో బయటకు తీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య శ్వేత, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.