ప్రేమికుడు మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో..యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-07T06:58:18+05:30 IST

ప్రేమించిన యువ కుడు మోసం చేయడంతో ఒక యువతి శుక్ర వారం ఆత్మహత్య చేసుకుంది. కె.జగన్నాథపు రానికి చెందిన పాటి మాధవి (26), అదే గ్రామానికి చెందిన పల్లపురెడ్డి ఫణిబాబులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ప్రేమికుడు మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో..యువతి ఆత్మహత్య

అయినవిల్లి, ఆగస్టు 6: ప్రేమించిన యువ కుడు మోసం చేయడంతో ఒక యువతి శుక్ర వారం ఆత్మహత్య చేసుకుంది. కె.జగన్నాథపు రానికి చెందిన  పాటి మాధవి (26), అదే గ్రామానికి చెందిన పల్లపురెడ్డి ఫణిబాబులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఫణిబాబుకు మరో యువతితో పెళ్లి నిశ్చయం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయ గా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి మాధవి ఫోన్‌ను అతడు బ్లాక్‌ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన మాధవి మే నెలలో స్థానిక చెరువులోకి దూకి ఆత్మహత్యాయ త్నం చేయగా స్థానికులు, బంధువులు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిం చారు. ఫణిబాబు వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి మాధవి ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలి పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 



Updated Date - 2022-08-07T06:58:18+05:30 IST