చికిత్స పొందుతూ వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-12-06T05:07:56+05:30 IST

భర్త, అత్తింటి వేధింపులు తాళలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన శ్రీలక్ష్మి(30) అనే వివాహిత చికిత్స పొం దు తూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది.

చికిత్స పొందుతూ వివాహిత మృతి
శ్రీలక్ష్మి మృతదేహం

వల్లూరు, డిసెంబరు 5: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన శ్రీలక్ష్మి(30) అనే వివాహిత చికిత్స పొం దు తూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. ఎస్‌ఐ విష్ణువర్థన్‌ వివరాల మేరకు.... ప్రొద్దుటూరుకు చెందిన పాలయ్య చెన్నూరుకు చెందిన శ్రీలక్ష్మిని 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. బ్రతుకుదెరువు కోసం పాలయ్య మండల పరిధిలోని పైడికాల్వ గ్రామానికి వచ్చి తన పెద్దమ్మ ఇంటిలో నివాసం ఉండేవాడు. ఈ క్రమంలో పాలయ్య తాగుడుకు బానిసై ప్రతినిత్యం భార్య శ్రీలక్ష్మిని వేధిస్తూ ఉండేవాడు. వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీ  నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ 5వ తేదీ ఆదివారం సాయంత్రం లక్ష్మి మృతి చెందింది. ఈ మేరకు ఆమె అక్క ఇల్లూరు గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలయ్య పెద్దమ్మ సుబ్బమ్మ, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణువర్థన్‌ తెలిపారు.


 

Updated Date - 2021-12-06T05:07:56+05:30 IST