మంటలతో పెళ్లి ఆగిపోయినా విందు భోజనం ఆపని అతిథులు

ABN , First Publish Date - 2021-11-30T02:43:59+05:30 IST

డైనింగ్ హాల్ వెనుక సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అయితే అప్పటికే విందు భోజనం ఆరగిస్తున్న కొంత మంది అతిథులు.. వెనక్కి తిరిగి ఆ మంటల్ని చూసినప్పటికీ తమకేం సంబంధం లేదన్నట్లుగా భోజనం చేస్తూ కనిపించారు. భివండిలోని అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సమాచారం..

మంటలతో పెళ్లి ఆగిపోయినా విందు భోజనం ఆపని అతిథులు

ముంబై: సహజంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే పెళ్లిల్లలో భోజనం కోసం సర్వసాధారణంగా గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు పెళ్లిని చాలా మట్టుకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కానీ ముంబై సమీపంలోని భివండిలో జరిగిన ఒక సంఘటన ఇందుకు భిన్నంగా ఉంది. పెళ్లి జరిగే ప్రదేశంలో మంటలు చెలరేగి పెళ్లి ఆగిపోయినా భోజనశాల మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. పెళ్లికి వచ్చిన అతిథులు తమకేం తెలియదన్నట్లుగా మంటలు చూస్తూ కూడా భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


వీడియో ప్రకారం.. డైనింగ్ హాల్ వెనుక సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అయితే అప్పటికే విందు భోజనం ఆరగిస్తున్న కొంత మంది అతిథులు.. వెనక్కి తిరిగి ఆ మంటల్ని చూసినప్పటికీ తమకేం సంబంధం లేదన్నట్లుగా భోజనం చేస్తూ కనిపించారు. భివండిలోని అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరు ద్విచక్ర వాహనాలు, కొన్ని కుర్చీలు, కొంత డెకరేషన్ సామాను దగ్ధమైపోయాయని, అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.



Updated Date - 2021-11-30T02:43:59+05:30 IST