పార్టీలో మార్పులు.. చేర్పులు చేయాలి: మర్రి శశిధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-20T20:43:37+05:30 IST

సోనియా నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.

పార్టీలో మార్పులు.. చేర్పులు చేయాలి: మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్: సోనియా నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తున్నామని, పార్టీలో సంస్థాగత లోపాలు గుర్తించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో మార్పులు.. చేర్పులు చేయాలన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనన్నారు. రాబోయే ఎన్నికలు పార్టీ మనుగడకు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తమది అసమ్మతి వర్గం కాదని, పార్టీ విధేయులుగా కలుసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇది తొలిసారి కాదని, గత మూడేళ్లుగా కలుసుకుంటున్నామని చెప్పారు. హుజురాబాద్ వంటి పరిస్థితి రాష్ట్రంలో రాకూడదన్నదే తన ఉద్దేశ్యమని శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-20T20:43:37+05:30 IST