ప్రభుత్వం అనుకుంటే హైదరాబాద్ పునఃనిర్మాణం సాధ్యమే: మర్రి శశిధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-23T16:34:52+05:30 IST

హైదరాబాద్: విపత్తు నిర్వహణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం అనుకుంటే హైదరాబాద్ పునఃనిర్మాణం సాధ్యమే: మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్: విపత్తు నిర్వహణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. విపత్తులకు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. ప్రభుత్వం అనుకుంటే హైదరాబాద్ పునఃనిర్మాణం సాధ్యమేనన్నారు. మూసీనది ప్రక్షాళన చేయకుంటే భవిష్యత్తులో హైదరాబాద్‌కు ప్రమాదమేనన్నారు. రూ.12 వేల కోట్లతో డ్రైనేజీని పునఃనిర్మాణం చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.60వేల కోట్లు ఎక్కుడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. విపత్తులు చెప్పిరావని.. ప్రభుత్వమే ముందస్తు చర్యలు చేపట్టాలని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-10-23T16:34:52+05:30 IST