వైసీపీ ప్రభుత్వంపై మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2021-01-15T23:12:30+05:30 IST

దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వ పాలన వల్ల రైతులు సంక్రాంతిని సరిగా జరుపుకోలేకపోయారని..

వైసీపీ ప్రభుత్వంపై మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వ పాలన వల్ల రైతులు సంక్రాంతిని సరిగా జరుపుకోలేకపోయారని పేర్కొన్నారు.  రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు ఏవిధమైన ప్రోత్సహం అందించడం లేదన్నారు. మడకశిరలో ఉగ్రప్ప అనే రైతు పండుగ రోజున ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం మీద నమ్మకం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం వ్యవసాయ రంగ పరిరక్షణకు పాటుపడాలని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు.

Updated Date - 2021-01-15T23:12:30+05:30 IST