మలక్పేట మార్కెట్ ఏర్పాటులో బట్కిరి కృష్ణది కీలకపాత్ర
ABN , First Publish Date - 2021-07-28T06:22:02+05:30 IST
ఉస్మాన్గంజ్ మార్కెట్ను మలక్పేట మహబూబ్ మ్యాన్షన్ మార్కెట్కు తరలించే విషయంలో మాజీ ఎమ్మెల్యే బట్కిరి కృష్ణ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్రెడ్డి, నర్సింహారెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
చాదర్ఘాట్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఉస్మాన్గంజ్ మార్కెట్ను మలక్పేట మహబూబ్ మ్యాన్షన్ మార్కెట్కు తరలించే విషయంలో మాజీ ఎమ్మెల్యే బట్కిరి కృష్ణ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్రెడ్డి, నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ మాజీ ప్రధాన కార్యదర్శి బట్కిరి విద్యానంద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అగ్రి ట్రేడర్స్ అధ్యక్షుడు దేవర రాజేశ్వర్, సలహాదారుడు తేలుకుంట్ల రమే్షగుప్తాల అధ్యక్షతన మంగళవారం మార్కెట్ ఆవరణలో బట్కిరి కృష్ణ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సీహెచ్ రాధ, ఆనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు చేగూరి వెంకటరమణ, మిర్చి అసోసియేషన్ అధ్యక్షుడు వంజరి వినోద్కుమార్, టీపీసీసీ కార్యదర్శి నిరంజన్, వ్యాపార ప్రతనిధులు కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఎస్జీఎస్ దామోదర్, డైరెక్టర్లు నూలి శ్రీధర్రావు, కుకుట్లపల్లి రవీందర్, వెంకట్రెడ్డి, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.