మూడు ప్రాంతాల్లో మార్కెట్‌ నిర్వహణ

ABN , First Publish Date - 2020-03-31T10:26:48+05:30 IST

సామాజిక దూరం పాటించేలా పట్టణంలోని మూడు ప్రాంతాల్లో మార్కెట్‌ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ ఈవో టి.హరి

మూడు ప్రాంతాల్లో మార్కెట్‌ నిర్వహణ

పాతపట్నం, మార్చి 30: సామాజిక దూరం పాటించేలా పట్టణంలోని మూడు ప్రాంతాల్లో మార్కెట్‌ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ ఈవో టి.హరి కృష్ణ తెలిపారు. ఏఎంసీ ఆవరణలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ ఇరుగ్గా ఉండ డంతో ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మూడు ప్రాంతాల్లో వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక యెరుకోలు మైదానం, జగత్‌జననీ సినిమా హాలు పక్కన, ఏఎంసీ ఆవరణలోను ఇకనుంచి మార్కెట్‌ నిర్వహిం చనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు.

Updated Date - 2020-03-31T10:26:48+05:30 IST