మార్చి 10-17 మధ్య ఈ మాల్కు ఎవరైనా వెళ్లారా!?
ABN , First Publish Date - 2020-04-03T14:31:40+05:30 IST
స్థానిక వేళచ్చేరిలోని ఫీనిక్స్ మార్కెట్సిటీ మాల్కు మార్చి 10 -17 తేదీల మధ్యలో వెళ్లినవారు కరోనా లక్షణాలుంటే..
చెన్నై : స్థానిక వేళచ్చేరిలోని ఫీనిక్స్ మార్కెట్సిటీ మాల్కు మార్చి 10 -17 తేదీల మధ్యలో వెళ్లినవారు కరోనా లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వాస్పత్రులు లేదా కార్పొరేషన్ను సంప్రదించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ఫీనిక్స్ మాల్లోని ఒక స్టోర్లో పనిచేస్తున్న ముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆ మాల్లో పనిచేస్తున్నవారందరూ, పైన పేర్కొన్న తేదీల్లో మాల్కు వెళ్లినవారు స్వీయ నిర్బంధంలో వుండాలని సూచించారు. అలాగే పై తేదీల్లో ఫీనిక్స్ మాల్కు వెళ్లినవారు 044-25384520, 044-46122300 నెంబర్లలో సంప్రదించి తమ వివరాలు తెలియజేయాలని కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ ప్రకటించారు.