కరోనాతో మెరైన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-16T05:23:27+05:30 IST

చింతపల్లి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంవీ రాజ్‌కుమార్‌(50) కరోనాతో మృతి చెందారు.

కరోనాతో మెరైన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

పూసపాటిరేగ, మే 15: చింతపల్లి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంవీ రాజ్‌కుమార్‌(50) కరోనాతో మృతి చెందారు. ఈయనకు వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో కొవిడ్‌ పరీక్ష చేయించు కున్నారు. కరోనా పాజిటివ్‌గా ఈనెల 13వ తేదీన నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం నెల్లిమర్ల మిమ్స్‌లో చేరారు.  చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఈయన ప్రస్తుతం విజయనగరంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని మెరైన్‌ డీఎస్పీ గోవిందరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ రామారావులు పరామర్శించారు.  

 

Updated Date - 2021-05-16T05:23:27+05:30 IST