గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-09-14T02:35:13+05:30 IST

జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు

గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి: జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చింతూరులో ఆరు లక్షల విలువైన రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీలేరు నుంచి రాజస్థాన్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-09-14T02:35:13+05:30 IST