నాచగిరి క్షేత్రాన్ని దర్శించుకున్న మారెడ్డి శ్రీనివా్సరెడ్డి
ABN , First Publish Date - 2022-01-24T05:15:46+05:30 IST
వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని ఆదివారం రాష్ట్ర సివిల్ సప్లయి చైర్మన్ మారెడ్డి శ్రీనివా్సరెడ్డి దంపతులు దర్శించుకున్నారు.
వర్గల్, జనవరి 23: వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని ఆదివారం రాష్ట్ర సివిల్ సప్లయి చైర్మన్ మారెడ్డి శ్రీనివా్సరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శభ్నవీసు హన్మంతరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్రెడ్డి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను అందజేశారు. నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని కొండపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఉపేందర్రెడ్డి సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.