ఛత్తీ్సగఢ్లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
ABN , First Publish Date - 2022-01-25T07:20:08+05:30 IST
ఛత్తీ్సగఢ్లోని నారాయణపూర్ జిల్లా భరండా పోలీ్సస్టేషన్
దుమ్ముగూడెం, జనవరి 24: ఛత్తీ్సగఢ్లోని నారాయణపూర్ జిల్లా భరండా పోలీ్సస్టేషన్ పరిధి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. దీంతో ఓ మావోయిస్టు మృతి చెందాడు. భరండా అటవీ ప్రాంతంలో కిస్కోడో ఏరియా కమిటీ మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చాలాసేపు పరస్పరం కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు తుపాకీ, పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు డీఎస్పీ అనూజ్కుమార్ చెప్పారు.