ఐఈడీ బాంబుతో రోడ్డును పేల్చివేసిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2020-07-14T05:02:05+05:30 IST

భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో..

ఐఈడీ బాంబుతో రోడ్డును పేల్చివేసిన మావోయిస్టులు

చైబాసా: భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఓ రోడ్డును శక్తివంతమైన ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఖున్పానీ బ్లాక్‌లోని బెర్కెల గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఎస్పీ ఇంద్రజీత్ మహతా వెల్లడించారు. కాగా నిన్న అటవీ శాఖకు చెందిన 12 భవనాలను నక్సలైట్లు పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఇవాళ మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో కొల్హాన్ డీఐజీ రాజీవ్ రంజన్ సింగ్, ఎస్పీ మహతా నేతృత్వంలో భద్రతా బలగాలు నక్సలైట్ల కోసం సమీప అడవుల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. 

Updated Date - 2020-07-14T05:02:05+05:30 IST