భూపాల పల్లి జిల్లాలో మావోయిస్తుల లేఖ కలకలం
ABN , First Publish Date - 2020-10-18T20:31:06+05:30 IST
జిల్లాలోని పంబాపూర్ గ్రామ సమీపంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టులు గోడలపై అతికించిన లేఖ కలకలం సృష్టించింది.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని పంబాపూర్ గ్రామ సమీపంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టులు గోడలపై అతికించిన లేఖ కలకలం సృష్టించింది. గత కొన్నిరోజులుగా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టిన నేపధ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ నక్సలైట్లు లేఖ రాయడం పై ఆయా పార్టీల ప్రజా ప్రతినిధుల్లోనూ వణుకు మొదలైంది. కరీం నగర్ , ఖమ్మం, వరంగల్ ఏరియా కమిటీ పేర కరపత్రాలను ప్రత్యక్షం అయ్యాయి. ఈసందర్భంగా గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ బంటు రమేష్కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. గత 8 సంవత్సరాల క్రితం బోర్లగూడెంలో వెంకటేశ్వరరావుకు పట్టిన గతే నలుగురికి పడుతుందని మావోలు లేఖలో హెచ్చరించారు. ఉమ్మడి వరంగంల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల ఆస్తులవివరాలను సైతం మావోలు లేఖలో పేర్కొన్నారు.