మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించండి: జగన్‌

ABN , First Publish Date - 2021-09-17T00:55:37+05:30 IST

దేశంలో విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఈ నెల 21 నాటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న

మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించండి: జగన్‌

నర్సంపేట: దేశంలో విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఈ నెల 21 నాటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు 17వ వార్షిక వారోత్సవాలను జరుపుకోవాలని సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసమే ప్రజాయుద్ధం కొనసాగుతున్నదన్నారు. జనతన సర్కార్ల నాయకత్వంలో విప్లవ సంస్కరణలు చేపట్టి నిజమైన అభివృద్ధి సాధించుకుంటున్నారని తెలిపారు. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేపడతున్నారని చెప్పారు. జనతన సర్కార్‌లో ప్రజలంతా సమష్టిగా భూ సమతలీకరణ, కుంటల నిర్మాణం, చేపల పెంపకం, తోటలు పండించండం, సమష్టి వ్యవసాయక్షేత్రాలు నిర్మించడం, ప్రజా పంచాయతీలు, విద్య, వైద్యం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుకుంటున్నారన్నారని పేర్కొన్నారు. జనతన సర్కార్ల ద్వారా స్వావలంబన నెలకొల్పుకుంటున్నారని జగన్ తెలిపారు. 

Updated Date - 2021-09-17T00:55:37+05:30 IST