భాస్కర్ లక్ష్యంగా కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్

ABN , First Publish Date - 2020-09-21T14:55:41+05:30 IST

మావోయిస్టు నేత భాస్కర్ లక్ష్యంగా ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. కదంబ అటవీ ప్రాంతంతో పాటు ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసులు

భాస్కర్ లక్ష్యంగా కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్

కొమురం భీం : మావోయిస్టు నేత భాస్కర్ లక్ష్యంగా ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. కదంబ అటవీ ప్రాంతంతో పాటు ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అలాగే మహారాష్ట్ర వైపు వెళ్లే దారుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు నేత బాజీరావు అంత్యక్రియలను అర్థరాత్రి పూర్తి చేశారు. అతని స్వగ్రామం అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామంలో పోలీసులు దగ్గరుండి మరీ అంత్యక్రియలను పూర్తి చేయించారు. మరో మావోయిస్టు చుక్కాలు మృతదేహం సిర్పూర్(టి) ప్రభుత్విలోనే ఉంది. ఇదిలాఉంటే, మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Updated Date - 2020-09-21T14:55:41+05:30 IST