జూలై 1న మావోయిస్టుల బంద్
ABN , First Publish Date - 2021-06-27T00:16:50+05:30 IST
జూన్ 16న జరిగిన దాడిలో మరణించిన వారికి విప్లవ జోహార్లంటూ మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ
విశాఖ: జూన్ 16న జరిగిన దాడిలో మరణించిన వారికి విప్లవ జోహార్లంటూ మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరుతో లేఖ విడుదలయింది. జూలై 1న బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో ఖనిజ సంపద కొల్లకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని గణేష్ విమర్శించారు. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కోట్లాది రూపాయల ఖర్చుతో వందలాది పోలీసులను ఆదివాసీ ప్రాంతంలోకి పంపిస్తోందని గణేష్ ఆరోపించారు.